Friday, December 18, 2009

మీకేం తెలుసు నిమ్మకాయ పులుసు

ఇవాళ ఆంధ్రప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో ఉద్యమ బాటపట్టిన వాళ్లం మేము.. అంతా కలిసికట్టుగా, సమైక్యంగా ఒకే గొంతుతో ఒకే నినాదం చేస్తున్నాం.. తమతో విడిపోతామని ఆందోళన చేస్తున్న తెలంగాణ వాసులు తమతోనే కలిసి ఉండాలని నినదిస్తున్నాం.. మీకు ఇష్టం ఉన్నా, లేకపోయినా మాతోనే కలిసి ఉండాలని హెచ్చరిస్తున్నాం.. విడిపోతే మీరు అభివృద్ధి సాధించటం కష్టం.. మేము లేకపోతే మీకు రాళూ్ల రప్పలే దిక్కని భవిష్యత్తును చూపిస్తున్నాం...మా అభిప్రాయమే మీ అభిప్రాయం.. మీకంటూ ఓ అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు.. మీ మంచి గురించి కూడా మేమే ఆలోచిస్తున్నప్పుడు.. మీ అభివృద్ధి బాధ్యత కూడా మేమే తలకెత్తుకున్నప్పుడు మీకెందుకు చింత.....

సమైక్యం కావాలా వద్దా అని మిమ్మల్ని అడగాల్సిన పని లేదు.. మీరెట్లా ఉంటే బాగుంటారో, ఎలా ఉండాలో, ఎలా ఉంచాలో మాకు తెలిసినప్పుడు.. ఇక మిమ్మల్ని అడగడం దేనికి.. సమైక్యం కావాలని మేమడిగితే చాలు.. మీతో పనేం లేదు.. మీరు కూడా సమైక్యమే కోరుకుంటున్నారనీ మేమే నిర్ధారించాం.. మీరు వేలిముద్రగాళు్ల.. చదువు సంధ్య, నాగరికత లేని వాళు్ల.. సంస్కృతిక వైభవానికి దూరంగా ఉన్నవాళు్ల మీకేం కావాలో మీకే తెలియదు..అసలు ఆవకాయ ఎలా తినాలో కూడా మేము నేర్పాం మీకు... మీకంటూ తిండి తినటం కూడా రాని వాళ్లను మేము పైకి తీసుకువచ్చాం.. అలాంటి మాకు వ్యతిరేకంగా, మా పట్ల కృతజ్ఞత లేకుండా కెసిఆర్‌ అనే ఒకానొక మూర్ఖుడు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నాడు.. మిమ్మల్ని ఉద్ధరించటానికి ఎక్కడో సుదూర ఆంధ్రప్రాంతం నుంచి వచ్చినవాళ్లం మేముండగా మీరు దేని గురించీ ఆలోచించాల్సిన పని లేదు.. మాట్లాడాల్సిన అవసరం లేదు.. మీ తరపున కూడా మేమే మాట్లాడతాం.. మేమే నిర్ణయాలు తీసుకుంటాం. విడిపోవాలని కోరుకునే హక్కు మీకు లేదు.. ఎలా బతకాలో ఎలాంటి బట్టలు కట్టుకోవాలో... ఏం తినాలో మీ అంతట మీరు నిర్ణయించుకో వీల్లేదు.. మీకేం తెలియదు.. మేం ఏం చెప్తే అది చేయండి.. ఏం కట్టుకోమంటే అది కట్టుకోండి.. ఏం తినమంటే అది తినండి.. మీరు మైనారిటీలు.. మీకు అభిప్రాయం ఉండకూడదు.. ప్రజాభీష్టం అంటే మేము చెప్పేదే..ప్రజలంటే మేమే... పొరపాటున కూడా మిమ్మల్ని మీరు ప్రజలుగా భావించుకోకండి... మేము చెప్పిందే వేదం.. మేము చేసిందే శాసనం.. మేము చూపిందే అభివృద్ధి అంటారు..
ఎవరితో సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నామో.. వారి ప్రమేయం లేకుండా.. వారితో సంబంధం లేకుండా, వారి అవసరం లేకుండా.. వారితో మాట్లాడకుండా, వారి ప్రాంతంలోకి వెళ్లకుండా వారికి బహు దూరంగా, వారిని అడ్డగోలుగా ఎలా పడితే అలా తిడుతూ.. పురుగుల్లా చస్తారని శాపనార్థాలు పెడుతూ... మనం అన్నదము్మలం.. విడిచిపెట్టావంటేనా తగలేస్తాం.. జాగ్రత్త... మీరెవ్వరు విడిపోవటానికి...మీరు ఉండాలో, విడిపోవాలో మేము చెప్పాలి.. మీరెట్లా బతకాలో మేము శాసించాలి.. విడిపోతామంటూ 38 మంది చచ్చిపోతే మాకేంటి...వాళ్ల ప్రాణాలకు కూడా విలువ కట్టడం మూర్ఖత్వం కాదా.. ! ఇదిగో మా దగ్గర ఒక్కరు చనిపోయారు.. అయ్యో.. అదీ మీకోసం, మీతో కలిసి ఉండటం కోసం.. ఏం తమాషా చేస్తున్నారా? కలిసి ఉండండి.. మీరు ఎంత గింజుకున్నా మిమ్మల్ని విడిపోనిచ్చేది లేదు.. ససేమిరా లేదు.. మీ భూమిలో, మా అధికారంలో మీరు బతుకులు వెళ్లదీయాలి. మీరు జాగో అన్నా.. భాగో అన్నా మేం పోయేది లేదు.. మీదొక భాష... అదొక యాస... ఆ మాట కూడా మాటేనా?
మాట్లాడితే అభివృద్ధి అంటారు.. వెనుకబడ్డాం అంటారు.. ఏం వెనుకబడ్డారు. రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేస్తే.. తెలంగాణలోని పది జిల్లాలూ అభివృద్ధి చేసినట్లే...ఎక్కువ మాట్లాడకండి.. రాజధాని మీ జిల్లాల మధ్యలోనే ఉంది. అది అభివృద్ధి జరిగితే మీ జిల్లాలన్నీ అభివృద్ధి జరిగినట్లే.. అదొక్కటి చాలదా మీ మొహానికి.. చూపెట్టుకోవటానికి. మీరు ఫ్లోరోసిస్‌తో చచ్చిపోతే మాకేం... ఆకలి చావులకు ఆహుతైతే మాకేం... గల్‌‌ఫకు వెళ్లి 30 వేల మంది జైళ్లలో మగ్గితే మాకేం... పోనీ రాజధాని అయినా అభివృద్ధి చేశారని సంతోషపడదామనుకుంటున్నారా? మీకంత సీనేం లేదు.. మీ ఊళ్ల మధ్యన ఉన్నంత మాత్రాన రాష్ట్ర రాజధాని మీ సొత్తు కాదు.. అది మాది.. ముమ్మాటికీ మాదే.. మేము కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మహానగరం అది... తొక్కల నిజాం కట్టిన పాడుబడ్డ బిల్డింగులు చూపి... అండర్‌డ్రైనేజీ చూపి ఆహో.. ఓహో అంటే చాలదు.. మా ఇళు్ల చూడండి.. మా అపార్‌‌టమెంట్లు చూడండి..మా వ్యాపారాలు చూడండి.. మా సినిమా స్టూడియోల ముందు వచ్చి పడిగాపులు కాయండి... ఇవన్నీ మేం తీసుకుపోతే మీకు మిగిలేది రాళూ్ల రప్పలే... మీ బతుకులను అలా రాళూ్ల రప్పల మధ్య ఎలా వదిలేస్తామనుకుంటున్నారు? అందుకే అది మీకు అప్పజెప్పేదేం లేదు.. మాకంటూ ఉన్న వ్యాపారాలు, బినామీ భూములను వదిలేసి మేమెందుకు వెళ్తాం. అభివృద్ధో అభివృద్ధి అని మీరు నెత్తీ నోరూ బాదుకుంటుంటే ఇదిగో ఈ రాజధానిని చూసుకుని సంతృప్తి చెందండి. అదే అభివృద్ధి అని స్పష్టంగానే చెప్తున్నాం కదా... మిగతా తొమ్మిది జిల్లాలు ఎడారులైతే మాకేం... అవేం మాకు అవసరం లేదు.. అంత గోల చేస్తే... సారీ మీ భాషలో లొల్లి పెడితే ఆ జిల్లాలన్నింటితో కలిపి మీరో రాష్టమ్రనే దుకాణం పెట్టుకొండి...రాజధాని జోలికి వచ్చారా ఖబడ్దార్‌.. రెక్కలు విరిచేస్తాం... ఈ రాజధానిని... మేము వదిలిపెట్టేది లేదు.. మీ ఊళ్లన్నింటినీ తొక్కుకుంటూ, పాదాక్రాంతం చేసుకుంటూ సదరు రాజధానిని మా చెప్పుచేతల్లో ఉంచుకోవటం ఖాయం. మీ ప్రాంతం నుంచి ఇక ఒక్కరూపాయి రాదని నిర్ధారించుకునేంత వరకూ మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఇది మేమొక్కరమే చేయటం లేదు.. ప్రపంచం అంతటా ఇదే ధర్మం నడుస్తోంది. గల్‌‌ఫలో చమురు కోసం ఇరాక్‌ను అమెరికా నాశనం చేయలేదా? అరబ్‌ ప్రపంచం మధ్య ఆధిపత్యం కోసం ఇజ్రాయిల్‌ను పుట్టించలేదా? కాశ్మీర్‌ను కొల్లగొట్టేందుకు పాకిస్తాన్‌ టెరర్రిజాన్ని ప్రోత్సహించలేదా? క్యూబా, ఆఫ్గనిస్తాన్‌, ఆఫ్రికా ఇవన్నీ బలవంతుల కింద నలిగి పోయినవే కదా... బలవంతులు తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నించినవే కదా... ఈ ప్రపంచంలో బలవంతుడిదే రాజ్యం.. రాజ్యం వీరభోజ్యం అన్న మాట వినలేదా? మీరేం వింటారు.. మీకేం చదువుసంధ్యలు వచ్చు గనుకనా? బలం ఎవడికి ఉంటే వాడిదే రాజ్యం.. ఇప్పుడు మాదే ఆంధ్రప్రదేశం... బాధితులకు అడిగే హక్కు ఎంతమాత్రం లేదు.. ప్రత్యేక ఉద్యమాలట.. ఉద్యమాలు.. నోరుమూసుకుని పడి ఉండండి.. మేం చెప్పినట్లు నడుచుకోండి..అంతా సమైక్యంగా ఉందాం.. కలిసి ఉంటేనే కలదు సుఖం.. విడిపోవాలని ఆలోచించకండి..మీరు కూడా అదే ఆలోచిస్తున్నారన్న సంగతి మీకే తెలియటం లేదు..మీరూ సమైక్యంగానే ఉంటున్నారని కోరుకుంటున్నారని మేం చెప్తున్నాం తెలుసుకోండి..నేర్చుకోండి.. వినమ్రంగా ఉండండి.. మా ఏలికలో సుఖశాంతులతో గడపండి..
జై సమైక్యాంధ్ర...
స్వామి,
source: http://kovela.blogspot.com/2009/12/blog-post_18.html

Monday, December 14, 2009

నిజం నిప్పులాంటిది..

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామంటూ భారత ప్రభుత్వం ప్రకటించిన క్షణం నుంచి రాష్ట్రంలో వాదోపవాదాలు బాగానే జరుగుతున్నాయి. తెలంగాణ ఎలా ఇస్తారంటూ ఆంధ్ర, రాయలసీమ నాయకులు రాజీనామాల రాజకీయానికి క్షణాల్లో తెరతీశారు.. ఆయా ప్రాంతాల ప్రజలూ భావోద్వేగంతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. పొట్టిశ్రీరాములు అమర త్యాగంతో సాధించుకున్న రాషా్టన్న్రి ముక్కలు చేయవద్దని ఒకరు.. పెద్ద రాష్ట్రంగా ఉండకుండా చీల్చేందుకు చిదంబరం కుట్ర చేశారని మరి కొందరు.... కేవలం పదకొండు రోజులు నిరాహార దీక్ష చేస్తేనే తెలంగాణ ఇస్తారా అని విమర్శించే వారు ఇంకొందరు.. ఎందుకో తెలియదు కానీ,సమైక్యంగా ఉంటే చాలని ఇంకా కొందరు..... ఎవరికి తోచిన రీతిలో, ఎవరి మనసుకు ఎలా అనిపిస్తే అలా వారి వారి అభిప్రాయాలు చెప్తున్నారు.. తెలంగాణ ఎందుకు ఇవ్వాలో.. ఎందుకు ఇవ్వకూడదో ఇప్పటికైనా ముందుకు వచ్చి చర్చ చేస్తున్నందుకు సంతోషం... ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం.. ఈ విస్తృత చర్చ వల్ల ఆరు దశాబ్దాల సమస్యకు, ఉద్యమాలకు, ఉద్వేగాలకు పరిష్కారం లభిస్తే అంతకంటే కావలసిందేముంటుంది? పరిష్కారం లభించకుండా సద్దుమణిగితే, నివురు గప్పితే... నిప్పు ఎప్పుడైనా ఎగిసే ప్రమాదం ఉంటుంది.. భావోద్వేగాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, స్వార్థ ప్రయోజనాలకు దూరంగా, సంస్కారవంతమైన రీతిలో, అందరికీ గౌరవాన్ని కలిగించే విధంగా, మర్యాదలను అతిక్రమించకుండా ఒక అన్ని ప్రాంతాల ప్రజల సుఖ సంతోషాలకు అనుకూలంగా పరిష్కారాన్ని సూచించగలిగితే ప్రజలు సుభిక్షంగా ఉంటారు....మనకు కావలసింది నేతలు సుభిక్షంగా ఉండటం కాదు.. వారి వ్యాపారాలు సుసంపన్నం కావటం కాదు.. రియల్‌ వ్యాపారులు సమృద్ధిగా ఉండటం కాదు.. సామాన్య ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలు, వనరుల వినియోగం, మనోభావాల పరిరక్షణ, భాష, యాస, పండుగ, పబ్బం, సంస్కృతి, నాగరికత, జాతీయతల పట్ల పరస్పర గౌరవ మర్యాదలతో, మన్ననలతో సుఖంగా, సంతోషంగా కలిసి మెలిసి ఉండేందుకు అవసరమైన పరిష్కారం సూచించగలగాలి... అన్ని ప్రాంతాల్లో ఎంతోమంది పెద్దలు ఉన్నారు. విజ్ఞులున్నారు... సావకాశంగా ఆలోచించండి.. సావధానంగా అవలోకించండి... ఆత్మను చంపుకోకుండా, నిజాయితీతో మనందరి క్షేమాన్ని, సంక్షేమాన్ని, సౌభ్రాతృతను దృష్టిలో ఉంచుకుని పరిష్కారాన్ని ఆలోచించండి...ప్రభుత్వానికి సూచించండి...

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్‌ వెనుక ఉన్న తెలంగాణ ప్రాంతం వాళు్ల అనేక కారణాలు చెప్తున్నారు.. అందులో న్యాయం ఎంత ఉంది, ఎంత లేదు అన్న మీమాంస పక్కనపెడితే, సమైక్యత కోరే వాళు్ల ఎందుకు కోరుకుంటున్నారో కారణాలు చెప్పటంలో కొంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నది. కేవలం సమైక్యత కావాలని అనటం మినహా ఎందుకో సహేతుకంగా వివరించటం విడిపోవాలని కోరుకుంటున్నవారికి ఆ విషయం తెలియజేయటం అవసరం... తప్పనిసరిగా విడిపోవాలని బలంగా కోరుకుంటున్న వారితో కలిసి ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారో చెప్పటం బాధ్యత... అది కనీస కర్తవ్యం...
సమైక్య త కోరుకుంటున్న సోదరులు హైదరాబాద్‌ మినహా ఏ వరంగల్‌ గురించో, కరీంనగర్‌ గురించో, నిజామాబాద్‌ కానీ, మహబూబ్‌ నగర్‌ కానీ, ఖమ్మం కానీ, ఆదిలాబాద్‌ కానీ, మెదక్‌ కానీ రంగారెడ్డి కానీ, నల్గొండ జిల్లాల గురించి మాట్లాడటం లేదు. కేవలం హైదరాబాద్‌ గురించి మాత్రమే గొంతెత్తి, ఎలుగెత్తి నినదిస్తున్నారు.. సమైక్యం అంటే హైదరాబాద్‌ మాత్రమేనా? హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి విడదీస్తే తెలంగాణ ఇవ్వటానికి వీరికి ఎలాంటి అభ్యంతరం లేదా? హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి విడగొడితే ఈ ఆందోళనలన్నీ సద్దుమణుగుతాయా? సమైక్యం అంటే ఇదేనా? మిగతా జిల్లాలు పరిగణలోకి వస్తాయా? రావా?
తెలుగు వారు అందరూ ఒకటే అన్నది రెండో నినాదం... ఇందులో సందేహం ఉండక్కర్లేదు.. కానీ, ప్రస్తుత రాష్ట్రంలో తెలుగు, ఆంధ్రము వేరు వేరుగా చూడబడుతున్న మాట ఎంతవరకు వాస్తవం..? తెలుగు వారి సంస్కృతి, ఆంధ్ర సంస్కృతితో భిన్నం చేసి చూపించటం, చిన్నచూపు చూడటం వాస్తవంగా ఎక్కడా జరగటం లేదా? ఆంధ్రమే అసలు తెలుగుగా, తెలంగాణలోని తెలుగు అసలు భాషే కానట్లుగా, తెలంగాణ ప్రజలు వేలిముద్రగాళ్లని, వారికి అక్షరాభ్యాసం చేసి, నాగరికత నేర్పించింది ఆంధ్రులేనన్న ప్రచారంలోని వాస్తవాస్తవాలు ఎన్ని? తెలంగాణ ప్రజలకు అభివృద్ధి అంటే ఏమీ తెలియదనీ, నిజాం పాలనలో వారు దారుణంగా వెనుకబడిపోయారని, ఆంగ్లేయుల ధర్మరాజ్యంలో తాము నాగరికంగా ఎంతో అభివృద్ధి చెందామని, అలా వెనుకబడిపోయిన తెలంగాణ ప్రజలను, ఆంగ్లేయుల ధర్మ పరిపాలనలో ఉద్ధరింపబడిన తాము ఉద్దరించినట్లు, ఇప్పటికీ ఉద్ధరిస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలో నిజానిజాలేమిటి?
సమైక్యత అంటే కలిసిమెలిసి ఉండటం అన్నది స్థూలంగా చెప్పుతున్న అర్థం... అన్ని ప్రాంతాల ప్రజలు ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉండటం వాంఛనీయమే. తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక జాతిగా భావిస్తే, ఆ ప్రజలంతా కలిసి మెలిసి ఉండటం అంటే, పరస్పర మనోభావాలను గౌరవించుకోవటం జరగాలి. ఒకరితో మరొకరు మమేకం కావాలి. పండుగల్లో, పర్వదినాల్లో పరస్పరం కలగలిసిపోవాలి.. సంబరాలు చేసుకోవాలి.. సౌభ్రాతృత్వంతో మెలగాలి. భాషలోని యాసను గౌరవించాలి. అందులోని తీయదనాన్ని ఆస్వాదించాలి. మర్యాదల్ని పాటించాలి.. విడిగా ఉన్న రెండు రాషా్టల్రను ఒక్కరాష్ట్రంగా కలిపి యాభై సంవత్సరాలు దాటింది. ఈ యాభై ఏళ్లలో ఏ ఒక్కనాడైనా తెలంగాణ ప్రజలతో పైన పేర్కొన్న ఏ ఒక్క సందర్భంలోనైనా ఇతర ప్రాంతాల ప్రజలు మమేకం అయిన ఉదాహరణలు ఉన్నాయా? గౌరవించనక్కర లేదు.. పండుగలు జరుపుకోనక్కర్లేదు.. కనీసం కించపరచకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయా? నీచంగా చూడకుండా ఉన్న సందర్భం ఉందా? రెండు రాషా్టల్రు ఒక్క రాష్ట్రంగా మారిందే తప్ప... రెండు జాతులు ఒక్క జాతిగా మారినట్లు దాఖలా ఉందా?
కొంత కాలంగా పరస్పర ప్రాంతాలకు అతీతంగా వివాహాలు జరుగుతున్న మాట నిజం. కానీ, ఇక్కడ ఉన్న తిరకాసు మరొకటి ఉంది. తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని వివాహం చేసుకుంటే, అబ్బాయి ఆంధ్రా వైపు మొగ్గుతాడు.. తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని చేసుకుంటే అటోమెటిక్‌గా మారిపోతుంది.. ఇదెలా ఉంటుందంటే మీ ఇంటికి వస్తే మాక్కావలసింది పెట్టండి.. మా ఇంటికి వస్తే మా కోసం తీసుకురండి.. అన్నట్లుగా ఉంటుంది. ఒక విధంగా బలవంతపు మతమార్పిళ్లలాగే తప్ప రెండు ప్రాంతాల మధ్య ఐక్యత సాధించటానికో, రెండు ప్రాంతాల కుటుంబాల మధ్య ఏకతా సూత్రాన్ని నిర్మించటానికో.. రెండు సమాజాలను ఒకదానిలో ఒకటి విలీనం చేయటానికో ఈ వివాహాలు ఉపయోగపడిన సందర్భాలు లేవు. ఈ రకమైన ధోరణిని ఎలా స్వీకరించాలి?
సామాజిక, సాంస్కృతిక జనజీవన విధానంలో ఈ రెండు జాతులూ ఏనాడూ ఒకటిగా లేవు.. ఒక రాష్ట్రంగా మారిన తరువాత కూడా ఒకటి కావటంలో పూర్తిగా విఫలమయ్యాయి. విభేదాలు పెరుగుతూ వచ్చాయి. వీరిని ఒకటి చేసేందుకు ఎవరూ ప్రయత్నించలేదు.. ప్రజల్లోనూ ఏకాత్మ భావన పెంపొందలేదు. ఇంతకాలంగా ఎవరికి వారుగానే ఉండిపోయారు.. ఇక ముందు కూడా ఎవరికి వారుగానే ఉండిపోతారు.. ఇలాంటి రెండు విభిన్నమైన జాతులను ఒకటిగా కలిపి బలవంతంగా ఉంచటం సాధ్యమేనా? ఇప్పుడు ఆందోళనలతోనో, మరో ఒత్తిడి రాజకీయాలతోనో విడిపోవటాన్ని జాప్యం చేయించవచ్చేమో...శాశ్వతంగా ఎంతకాలం కలిసి ఉండేలా చేయగలరు? తెలంగాణ వారిని ఏకపక్షంగా నిందించటం వల్లనో, ఆంధ్రప్రాంతం వారిని నిందించటం వల్లనో కలిసి ఉండటం సాధ్యమా?
సమైక్యం కావాలని కోరుకుంటున్నామంటున్న నాయకగణం చెప్తున్న వాదన ఒకటి ఉంది. రాష్ట్రంలోని ప్రజలంతా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను కోరుకుంటున్నారని.. నిజంగా అలా కోరుకుంటే ఇంత గందరగోళం దేనికి? కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అనే ఒక దుర్మార్గుడైన వేర్పాటు వాది కారణంగానే అల్లకల్లోలం జరుగుతోందని వారి వాదన. అదే నిజం అని కాసేపనుకుందాం.. రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నాయి. అందులో పది జిల్లాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. తెలంగాణ కావాలన్న డిమాండ్‌ కూడా ఈ పది జిల్లాల్లో పదకొండు రోజుల పాటు ప్రతిధ్వనించింది. ఈ పదకొండు రోజుల్లో ఈ పది జిల్లాలు మినహా మరే జిల్లాలో ఒక్క క్షణం పాటైనా సమైక్య నినాదం వినిపించలేదు.. కెసిఆర్‌ చేస్తున్నది తప్పు.. తెలంగాణ ప్రజలు కోరుతున్నది తప్పు.. సమైక్య రాష్టమ్రే కావాలని ఏ ఒక్క చోటా ఒక్క పౌరుడు కూడా పల్లెత్తు మాట మాట్లాడలేదు. తెలంగాణలో జరుగుతున్న ఆందోళనలను టివీల్లో చూస్తూ కూచున్నారు.. (చూసి ఉండకపోవచ్చు కూడా.. ఎందుకంటే వారికి గుడ్డి నమ్మకం తెలంగాణ ఇచ్చే సాహసాన్ని సోనియమ్మ చేయదని)...అదే నమ్మకంతో సోనియమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యమంటూ ఆ పార్టీ నేతలు, పక్క పార్టీ నేతలు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించారు.. తీరా చిదంబరం దొర చిట్టా విప్పి తెలంగాణకు పచ్చజెండా ఊపటంతోనే అందరి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఏం చేయాలో తోచలేదు. అమ్మని ధిక్కరించలేరు.. కాదని మనలేరు.. ఔనని ఊరుకోలేరు.. అందుకే ఒత్తిడి రాజకీయాలు మొదలయ్యాయి. ఇందులో వారి తప్పేమీ లేదు. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి. అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కోస్తా అయినా, సీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా మినహాయింపు లేదు. సమైక్య వాదుల నినాదం ప్రకారం విడిపోవాలని గొడవ చేస్తున్నది కెసిఆర్‌. పదకొండు రోజుల ఉద్యమాన్ని స్పాన్సర్‌ చేసి నడిపించింది కెసిఆర్‌. ఈ వాదనల ప్రకారం తెలంగాణ ప్రజలకు కూడా తెలంగాణ కావాలని లేదన్నమాట.. అలాంటప్పుడు చిదంబరం ప్రకటన రాగానే నిరసన వ్యక్తం చేయాల్సింది నిజంగా ఎవరు? తెలంగాణ ప్రజలు.. మేము మా ఆంధ్ర సోదరులతోనే కలిసి ఉంటాం.. విడిపొమ్మనటానికి కెసిఆర్‌ ఎవరు? మమ్మల్ని అన్యాయం చేయకండి అని గొడవ చేయాల్సింది తెలంగాణ ప్రజలు... మరి పది జిల్లాల్లో ఒక్క చోట కూడా ఈ నినాదం వినిపించలేదు. సమైక్యం కోసం ఆందోళన జరగలేదు. పైగా సంబరాలు చేసుకున్నారు.. దీని అర్థం ఏమిటి? ఉద్యమాన్ని కెసిఆర్‌ స్పాన్సర్‌ చేస్తే.. తాము అన్యాయంగా విడిపోతామన్న ఆందోళన తెలంగాణ ప్రజల్లో ఉంటే స్పాంటేనియస్‌గా తెలంగాణ ప్రజల్లో నిరసన వ్యక్తం కావాలి కదా? ఎందుకు కాలేదు.. ఈ మాత్రం ఆలోచన వారిలో వచ్చేలాగా గత యాభై ఏళ్లలో ఆంధ్రప్రాంత ప్రజలు వారిని విద్యావంతులను చేయటంలో సక్సెస్‌ కాలేకపోయారా?
తెలంగాణ వస్తే ఆంధ్రప్రాంత ప్రజలకు భద్రత ఉండదనే భయం ఉందని జెసి దివాకర్‌ రెడ్డి జీ 24 గంటలుతో అన్నారు.. ఆయన అన్నట్లు అభద్రతాభావం నిజంగా ఉంటే, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రాంత ప్రజలైనా ఆందోళన చేయాలి కదా? వాస్తవంగా అభద్రతాభావం ఉన్నదెవరికి? వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళన ఉన్నదెవరికి?
ఇక సమైక్యవాదులు చెప్పే మరో ప్రముఖమైన మాట హైదరాబాద్‌ నగరాన్ని వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మేం అభివృద్ధి చేశామని.. అవన్నీ తీసుకుని పోతే హైదరాబాద్‌లో రాళూ్ల రప్పలూ తప్ప మిగిలేది ఏమీ లేదని....సంతోషమే. హైదరాబాద్‌ను ఆంధ్రప్రాంత ప్రజలు ఎంత అభివృద్ధి చేశారో చెప్తే సంతోషమే... కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో కొత్త కాలనీలు వెలసి నగరం విస్తరించింది. ఇళు్ల కట్టుకున్నారు.. అపార్‌‌టమెంట్లు వెలిశాయి. రియల్టర్ల వ్యాపారం పెరిగింది. ఇవి కాకుండా సినిమా పరిశ్రమ రావటం వల్ల జూబ్లీహిల్‌‌స, బంజారాహిల్‌‌స వంటి ప్రాంతాలు డబ్బున్నోళ్ల వీధులుగా మారిపోయాయి. ఇవి కాకుండా హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి ఏమిటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి... రోడ్లు విస్తరించటం, ఫై్ల ఓవర్లు కట్టడం అభివృద్ధిలో భాగమే.. రాషా్టన్రికి రాజధానిగా ఉన్న నగరం విస్తరిస్తున్న క్రమంలో ప్రజలకు రహదారి సౌకర్యం కల్పించటం ప్రభుత్వాల బాధ్యత.. అది హైదరాబాదైనా, మరో నగరమైనా ఒకటే. భారత దేశానికి ప్రధానమైన సైనిక బేస్‌ హైదరాబాద్‌లో ఉంది. హైదరాబాద్‌ ఏ రాష్ట్రంలో ఉన్నదన్న దానితో నిమిత్తం లేకుండా సైనిక అవసరాలకోసం ఉపయోగపడుతున్న నగరంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనివార్యంగానే వస్తాయి. ఇందులో ఆంధ్ర ప్రాంతవాసుల పెట్టుబడులు ఉన్నాయనుకోం..హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కాలం నాటిది... ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, వుమెన్‌‌సకాలేజీ, హైకోర్టు, రాజ్‌భవన్‌, అసెంబ్లీ, దిల్‌కుశ్‌ గెస్‌‌టహౌస్‌, పురానాపూల్‌, నయాపూల్‌, మక్కామసీదు, హుస్సేన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌, నగరంలో ప్రస్తుతం ఉన్న అండర్‌ డ్రైనేజీ వ్యవస్థ, ఆబిడ్‌‌స, కోఠీ వంటి వాణిజ్య ప్రాంతాలు, నాంపల్లి, సికిందరాబాద్‌, కాచీగూడ రైల్వే స్టేషన్లు, బేగంపేట విమానాశ్రయం, సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడ ఇవన్నీ కూడా నిజాం కాలం నుంచీ ఉన్నవే... ఇప్పటి ప్రభుత్వాలు కానీ, లగడపాటి రాజగోపాల్‌ వంటి తెలుగువారందరి మేలు కోరుతున్నాననే మహా గొప్ప పారిశ్రామిక వేత్త కానీ పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసినవి కావు. ఫై్ల ఓవర్లు మినహా ప్రస్తుత ప్రభుత్వాలు హైదరాబాద్‌లో ప్రజలకు కల్పించిన మౌలిక సదుపాయాలు మచ్చుకు కూడా కనిపించవు. మరి ఆంధ్రప్రాంత పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి? అసలు ఉన్నవి పెట్టుబడులా? వ్యాపారమా? వ్యాపార ప్రయోజనం ఎక్కడ ఉన్నా నెరవేర్చుకోవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇందులో ఎవరికైనా ఇబ్బంది ఉండాల్సిన అవసరం దేనికి? ఈ ప్రయోజనాలు దెబ్బ తింటాయంటూ ఒక ప్రాంత ప్రజలను, ఒక జాతిని కించపరచటం, మనోభావాలను దెబ్బతీయటం అవసరమా?
ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రాంత ప్రజలు తమ వనరులపై తాము సొంతగా జీవించలేరని, ఇతరుల వనరులపైనే ఆధారపడి జీవించటానికి వాళు్ల అలవాటు పడిపోయారని... ఇతరుల ఆదాయంపైనే ఆధారపడ్డారని.. ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్లకు వనరులు లేవా? బందరు పోర్టు ఉంది. కాకినాడ గ్యాస్‌ ఉంది.. బాకై్సట్‌ నిక్షేపాలు ఉన్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్‌‌ట ఉంది. సువిశాల సముద్రతీరం ఉంది. సుసంపన్నమైన వ్యవసాయం ఉంది. రేపు ఆంధ్ర రాష్ట్రం అంటూ ఏర్పడితే అక్కడ రాజధాని వస్తే, ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా ఏర్పడితే లక్షమందికి పైగా ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఉపాధి కలగవచ్చు. వీటన్నింటినీ ఆధారం చేసుకుని స్వయం సమృద్ధి సాధించటం వారికి సాధ్యం కాదా? మేము మీతో ఉండము మొర్రో.. మీ దారిన మీరు వెళ్లండి బాబూ.. మీ డబ్బులు, మీ వనరులు మాకేం వద్దు.. మా వాటా మా కిచ్చి వెళ్లి పొండని ఇంతగా చీత్కరించుకుంటున్నా చూరు పట్టుకుని వేళ్లాడుతున్నారన్న ఆరోపణల్లో వాస్తవం ఏమిటి?(ఆంధ్రజ్యోతిలో వస్తున్న వ్యాసాలు చూడవచ్చు.)మరి వద్దు పొమ్మంటున్నా మేముంటామంటూ ఆంధ్రప్రాంత ప్రజలు ఇంత బేలగా అయిపోయారన్న తెలంగాణ సంఘాల వాదన నిజమేనా? నిజమే అయితే ఎందుకింత బేలతనం..? అది కవిత రాసిన కాలం నుంచి మహామహులు ఉద్భవించిన ఆంధ్ర తేజస్సు తన అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతుంది? విజ్ఞులే సమాధానం చెప్పాలి.
సమైక్య రాష్ట్రంవిడిపోవటం వల్ల ఆంధ్ర సీమ ప్రాంతాలకు జరిగే నష్టాలేమిటి? అన్నది ఇదమిత్థంగా తేలాలి. నీటి వనరుల సమస్యే అయితే ఆ సమస్య పరిష్కరించటానికి ట్రిబ్యునల్‌ ఎలాగూ ఉంటుంది. ఎవరి వాటా ఏమిటన్నది అదే తేలుస్తుంది. అసలు అది సమస్యే కాదు.. మిగతా సమస్యలేవైనా రాష్ట్రం ఏర్పాటుకు ముందే విధి విధానాలు రూపొందుతాయి. సమస్యలన్నీ అప్పుడే పరిష్కారమవుతాయి. ఇక చిన్న రాషా్టల్ర వల్ల పరిపాలన సవ్యంగా సాగదంటే అది భ్రమే. పరిపాలించే రాష్ట్రం చిన్నదా? పెద్దదా? దాని భౌగోళిక సరిహద్దులు ఏమిటి? అన్నది ప్రధానం కాదు.. పాలకులు ఎంత చక్కగా పరిపాలిస్తున్నారు అన్నది ముఖ్యం. పాలకులు సమర్థులైతే, ప్రజల పట్ల ప్రేమగలవారైతే రాష్ట్రం అభివృద్ధి ఎల్లలు దాటి ముందుకు పరిగెడుతుంది. అదీ ఒకజాతి వారిని ఆ జాతి వారే పరిపాలించే సౌలభ్యం ఉంటే అభివృద్ధి అసాధ్యం కాదు..మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒక భాష మాట్లాడే రెండు జాతుల ప్రజలు.. ఈ రెండు జాతులను కలిపి ఉంచటం సాధ్యం కాదు.. గతంలోనూ ఇవి రెండు రెండు రాషా్టల్రుగానే ఉన్నాయి. ఇవాళ పొట్టి శ్రీరాములుగారి ఫోటోలు పెట్టుకుంటున్న మహాను భావులంతా గ్రహించాల్సింది ఆయన మద్రాసు నుంచి ఆంధ్రరాష్ట్రం విడిగాకావాలని కోరుకున్నారే కానీ, ఆంధ్రప్రదేశ్‌ను కాదన్నది గ్రహించాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంతం అందులో భాగంగా లేదన్నది గుర్తించాలి. ఆ తరువాత మూడేళ్లకు కానీ ఆంధ్ర గడుసు పిల్లవాడితో అమాయకురాలైన తెలంగాణాను ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు సాక్షాత్తూ నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రకటించారు.. ఇష్టం వచ్చినప్పుడు విడిపోవచ్చని కూడా ఆయన భవిష్యత్తు చెప్పారు.. ఇప్పుడు జరుగుతున్నది అదే... సోనియా మాట వినకపోతే సరి... కనీసం తమ పార్టీకి మూలస్తంభాలలో ఒకరైన నెహ్రూ మాటలనైనా గౌరవిస్తే మంచిది కదా... ఆలోచించండి...


Source http://kovela.blogspot.com/2009/12/blog-post_14.html

Saturday, December 12, 2009

వద్దంటే, ఇదేం గోల?




తాము కలిసి ఉండడానికి సిద్ధంగా లేమని తెలంగాణవారు అంటుంటే తాము కలిసి ఉంటామని కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు వాదించడంలో అర్థం కనిపించడం లేదు. పైగా, సమైక్యాంధ్రప్రదేశ్ నినాదంతో ఉద్యమం చేపట్టారు. పార్టీలకు అతీతంగా ఆ ప్రాంతాల శాసనసభ్యులు రాజీనామాలు చేసి ఏ అడ్డంకులూ లేకుండా శాసనసభ ఆవరణలో వ్యవహరిస్తున్నారు. ఏ ఉద్యమానికైనా కార్యకారణ సంబంధం ఉండాలి. ఏ వాదనకైనా హేతుబద్ధత ఉండాలి. సమైక్యాంధ్రవాదులకు ఆ రెండూ లేవు. పైగా, తెలంగాణకు చెందిన ఒక సమూహం గానీ వర్గం గానీ తాము కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం లేదు. అలాంటి ఒక సమూహమో లేదా వర్గమో ఉన్నప్పుడు వారి వాదనకు కొంత బలమైనా చేకూరి ఉండేది. ఏ కారణమూ లేకుండా, హేతుబద్ధత అసలే లేకుండా తాము విడిపోవడానికి సిద్ధంగా లేమని వాదిస్తే దాన్ని ఏమనుకోవాలి. దోచుకోవడానికి, ఆధిపత్యం చెలాయించడానికి, అణచి వేయడానికి, పాలించడానికి తమకు హక్కు ఉందని అనడమే. అంతకన్నా తమకు తెలంగాణతో కలిసి ఉండడం వల్ల స్వప్రయోజనాలున్నాయని అనుకోవాలి. స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే కలిసి ఉండాలని కోరుకుంటున్నామని అనుకోవాలి.

దశాబ్దాల మోసం, అణచివేత కింద తాము నలిగిపోయామని, తాము విడిపోతామని తెలంగాణ వారు వాదిస్తుంటే, అందుకు తగిన కారణాలు చూపుతుంటే, అందుకు తగిన ప్రాతిపదికను ముందు పెడుతుంటే సమైక్యాంధ్రవాదులు మాత్రం తాము పట్టిందే పట్టు అన్నట్లు ఏ విధమైన కారణాలు చూపకుండా సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారు. కనీసం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరి చేస్తామని చెప్పడం లేదు. కనీసం, అన్యాయం, అణచివేత, విస్మరణ జరగలేదని చెప్పడానికి కూడా సిద్ధం కావడం లేదు. అంటే, వారు ఏకపక్షంగా, అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని అనుకోక తప్పదు. రాజకీయ నాయకులు హైదరాబాదులో ఉండి చాలా హాయిగా తమ తమ ప్రాంతాల ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి ఆట సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో జరుగుతున్న విధ్వంసం గురించి, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం గురించి, విద్యార్థుల చదువుల గురించి వారు మాట్లాడడం లేదు. మీడియా కూడా అక్కడి విధ్వంసం గురించి ఏమీ ఎత్తడం లేదు. తెలంగాణలో జరుగుతున్న సంఘటనలను భూతద్దంలో చూపెట్టారు. రాష్ట్ర పోలీసు బలగాలు సరిపోవన్నంటూ, తెలంగాణేతర బలగాలను, కేంద్ర బలగాలను రంగంలోకి దింపి ఒక రకమైన భాయనక వాతావరణాన్ని కల్పించారు. తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సూచిస్తే కూడా ముఖ్యమంత్రి కె.రోశయ్య చర్యలు తీసుకోలేదు. పైగా, చాలా సున్నితంగా విద్యార్థులపై పోలీసులు దాడి చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయని సన్నాయి నొక్కులు నొక్కారు. తెలంగాణలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన కొద్దిపాటి విధ్వంస కాండపై గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణేత ప్రాంతాల్లో జరుగుతున్న విధ్వంసకాండపై, ఆర్టీసి బస్సులపై జరుగుతున్న దాదడుల గురించి, దుకాణాలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మాట్లాడడం లేదు.

పార్టీలకు అతీతంగా తమ తమ పార్టీల శాసనసభ్యులు రాజీనామాలు చేయడాన్ని కాంగ్రెసు, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ఆ మూడు పార్టీలు కూడా కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల చేతుల్లోనే ఉండడం కారణం కాదా. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను నామమాత్రం చేసి వైయస్ జగన్ నాయకుడిగా చెలామణి కావడం కాదా. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి మావోయిస్టులు ప్రవేశించారంటూ ప్రచారం చేసిన ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు ఉత్తరాంధ్రలోని నక్సలైట్ల ప్రాబల్యం గురించి ఎందుకు మాట్లాడడం లేదు. అక్కడ కూడా నక్సలైట్ ప్రాబల్యం ఉంది కదా. ఆ ఉద్యమంలోకి కూడా మావోయిస్టులు ప్రవేశించి ఉండవచ్చు కదా. ప్రశాంతంగా జరపాలని మాత్రమే సున్నితంగా చెప్పి మీరు కానీయండన్నట్లు నాయకులు వ్యవహరించడాన్ని ఏ నీతి అనుకోవాలి.

పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు రాజీనామాలు చేయడం పార్టీ నిర్ణయాలను ధిక్కరించడం కాదా. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన ఆ పార్టీల నాయకులు వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు. అంటే వారి పక్షపాత వైఖరిని బయట పెట్టుకున్నట్లే కదా. రాజకీయ సంక్షోభం సృష్టించి, బ్లాక్ మెయిల్ చేసి తమ ఆధిపత్యాన్ని, మోసాన్ని, దగాను నిరంతరం కొనసాగించడానికి వేస్తున్న ఎత్తులే సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నాయని అనుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుల రాజీనామాలను ఏ విధంగానైతే స్పీకర్ ఆమోదించారో అలాగే ప్రస్తుత శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ ఆమోదించాల్సి ఉంటుంది. అణచివేతకు, అన్యాయానికి, వివక్షకు గురవుతున్న సెక్షన్లు రాజకీయ సంక్షోభాన్నే కోరుకుంటాయి. సంక్షోభం ఆధిపత్య వర్గాలకు, పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఉండకూడదు. అందువల్ల శాసనసభ్యుల రాజీనామాల ఆమోదాన్నే తెలంగాణవాదులు కోరుకుంటున్నారు.

మన కన్నా తక్కువ జనాభా ఉన్న అమెరికాలో 50 రాష్టాలున్నాయి. మన రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడితే 29 రాష్ట్రాలవుతాయి. అందులో తప్పేముంది. మరిన్ని రాష్టాలు వస్తే నష్టమేమిటి, ఎవరికి నష్టం అని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆదర్శం కాదని ముఖ్యమంత్రి రోశయ్య హితబోధ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రకటన చేసిన తర్వాత మరిన్ని రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్యమాలు ముందుకు వస్తున్నాయని, మనం ఆదర్శంగా నిలబడాలని, ఇది ఆదర్సం కాదని ఆయన అంటున్నారు. అంటే, ఆయన మనసులో మాటను ఏ విధంగా బయటపెట్టారో అర్థం చేసుకోవచ్చు. బుందేల్ ఖండ్, విదర్భ లాంటి అన్ని దగా పడ్డ ప్రాంతాల ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ ను తెలంగాణ ఉద్యమం బలపరుస్తున్నది. తెలంగాణ ఉద్యమం వెనక ప్రాపంచిక దృక్పథం, ప్రజా మేలు కోరే మేధావులున్నారనే విషయాన్ని సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ నాయకులు, కుహనా మేధావులు గుర్తించాల్సి ఉంటుంది. అందుకే ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటును కూడా తెలంగాణ ఉద్యమం ఆశిస్తుంది. మద్రాసు నుంచి వేరు పడిన తర్వాత రాయలసీమ ప్రాంత ప్రజలు కోస్తాంధ్ర నాయకత్వం చేతిలో ఎలా మోసానికి గురైందో, శ్రీబాగ్ ఒడంబడిక ఎలా ఉల్లంఘనకు గురైందో తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నష్టపోయేది సాధారణ ప్రజానీకమే. వారిని చీకట్లో పెట్టి రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు.

Source: http://thatstelugu.oneindia.in/feature/columns/2009/no-reason-behind-the-united-andhra-111209.html

Thursday, December 3, 2009

ఆ బలవంతపు పెళ్లికి విడాకులెప్పుడు?


Source: http://www.andhraprabha.in/specialstories/article-43713


దేశంలో ఏ ప్రాంతానికి లేని తిరుగుబాటు తత్వం తెలంగాణాకుంది. నాయకత్వ విద్రోహం వల్ల ఈ గడ్డపై జరిగిన ఉద్యమం వేలసార్లు అపజయం పాలైనా ఫినిక్స్‌ పక్షి మాదిరి పునరుత్థానం చెందుతూనే ఉంది. నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఉద్యమం దాకా ఈ ప్రాంతం ప్రజలు చేస్తున్న పోరాటాలు అజరామరం. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి నిరసనగా, దున్నేవానికి భూమికోసం సాగిన ఉద్యమంలో నాలుగు వేలమంది ప్రాణాలు కోల్పోతే, 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో 379 మంది యువకులు ఆత్మబలిదానం చేశారు. ఇక నక్సలిజం పేరుతో ఈ నేల చెల్లించిన మూల్యం వెలకట్టలేనిది.

మన ఓటుతోనే మనపై స్వారీ చేస్తున్న పెద్దలకు తెలంగాణలో ఎగిసిపడుతున్న ఉద్యమాలను అణిచివేయాలనే తపనే తప్ప సమస్యను పరిష్కరించాలన్న శ్రద్ధకాని, ఆసక్తిగాని ఎన్నడూ కనపర్చలేదు. సమస్య దున్నేవానికి భూమైనా, ఫ్రీ జోనైనా పాలకులు అనుసరించిందీ, అనుసరించేదీ దమననీతే! కాకతీయుల నుండి అసఫ్‌జాహిల వరకు, నెహ్రూ నుండి రోశయ్య వరకు పాలకులు ఎవరైనా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు మాత్రం నేటికీ నెరవేరలేదు, స్వేచ్ఛ స్వావలంబన, సార్వభౌమాధికారం కోసం ఈ నేల ఎంత రక్తాన్ని చిందించిందో ఏవూరి పొలిమేరనడిగినా చెబుతుంది. 1947 సెప్టెంబర్‌ 17న రాజరికపు పీడ నుండి తెలంగాణ బయటపడ్డా, నవనాగరికల చీడ నొదిలించుకోవడానికి ఈ ప్రాంతం ఇంకా పెనుగులాడుతూనే ఉంది.

పెద్దల హ్రస్వ దృష్టికి తెలంగాణ బలి : నిజాం లొంగుబాటు అనంతరం తెలంగాణ ప్రాంతం సివిల్‌ అడ్మినిస్ట్రేటర్‌ పాలనలోకి వచ్చింది. 1953 సంవత్సరంలో హైదరాబాద్‌ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ బూర్గుల రామకృష్ణారావుని హైదరాబాద్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది. మరోపక్క మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రం బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతుంది. అరకొర వసతులతోను, చాలీచాలని ఆర్థిక వనరులతోను ఈతిబాధలు అనుభవిస్తున్న ఆంధ్ర రాష్ట్రం ఎలాగైనా సరే హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆక్రమించాలని తలచింది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు అదే తరుణంలో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ అంశాన్ని పరిశీలించడానికే కేంద్ర ప్రభుత్వం 1953 డిసెంబర్‌ 22న సయ్యద్‌ ఫజల్‌ అలీ, సర్దార్‌ ఫణిక్కర్‌, హెచ్‌ఎన్‌ కుంజ్రులతో రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ నియమించింది. 1955 సెప్టెంబర్‌ 30న త్రిసభ్య కమిషన్‌ అందించిన నివేదికలో తెలంగాణ ప్రాంతాన్ని 7 ఏళ్లపాటు ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించి అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేకాక 1962 శాసనసభ ఎన్నికల తరువాత హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభలో మూడింట రెండింతలు సభ్యులు అంగీకరిస్తేనే తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలనే షరతునూ విధించింది.

1956 ఫిబ్రవరి 20న ఫజల్‌ అలీకమిషన్‌ సిఫార్సులకు భిన్నంగా కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఒప్పందం కుదిర్చింది. ఢిల్లీలోని హైదరాబాద్‌ భవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పెద్దమనుషుల కుట్ర ఫలితంగానే 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించింది. వీరోచితమైన పోరాటాలు ఆలంబనగా హైదరాబాద్‌ రాష్ట్రం,పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే, కాంగ్రెస్‌ నాయకుల కుట్ర ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ జరిగింది.

తెలంగాణ ప్రాంతపు ఆదాయాన్ని ఆ ప్రాంతం అభివృద్ధికే ఖర్చు పెట్టాలని, తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను నిర్ణీత నిష్పత్తిలో పొందడానికి 15 సంవత్సరాల నివాస నిబంధన ఉండాలని, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని, మంత్రిమండలిలో ఆంధ్ర, తెలంగాణ వారు 3 : 2 శాతం ఉండాలని ఆ ఒప్పందంలో స్పష్టంగా పొందపర్చేరు. ఈ ఒప్పందానికి ఎలాంటి చట్టబద్ధత కల్పించకపోవడం, ఒప్పందంలోని అంశాలను భారత రాజ్యాంగంలో పొందుపర్చక పోవడంతో ఒప్పందంపై సంతకాల తడి ఆరకముందే ఉల్లంఘనలకు గురైంది. ఆ తర్వాత వచ్చిన అఖిల పక్ష బృందం, 5, 6, 8 సూత్రాల పథకాలదీ అదే తీరు! 610 జి.ఓ. అమలుకు నోచుకోలేదు, దూరదృష్టి లేని పెద్దల ఒప్పందాలలో రాష్ట్రం రావణ కాష్ఠం అయింది, జైఆంధ్ర, తెలంగాణ ఉద్యమాల ఉభయ ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చును పెట్టాయి.

ఒక అమాయకురాలు (తెలంగాణ) పెళ్లి ఒక తుంటరి పిల్లవానితో జరగనున్నది. భవిష్యత్తులో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిసివుంటే పొంతన కుదరకపోతే ఆలుమగలు విడాకులు ఇచ్చుకున్నట్టే రెండు ప్రాంతాలు విడిపోవచ్చని ఎంతో దార్శినికతలో 6.3.1956 న నెహ్రూ నిజామాబాద్‌లో చెప్పిన మాటల్ని నేటి కాంగ్రెస్‌ ఖాతరు చేయడంలేదు.

అన్యాయాల పుట్ట నేటి తెలంగాణ : 1956 నవంబర్‌ 1 తెలంగాణకు దుర్దినం ఈ రోజునుండే 224 సంవత్సరాలు స్వయంప్రకాశంగా, సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ ప్రాంతం తిరోగమన బాట పట్టింది. సాగునీరు, తాగునీరు, పరిశ్రమ, విద్య, వైద్యం, వ్యవసాయ, ఉపాధి, ఒకటేమిటి రాష్ట్రం అన్ని రంగాలలో వివక్షకు గురైంది. ఆంధ్రప్రదేశ్‌లోతెలంగాణ ప్రాంతం భౌగోళికంగా 41.75 శాతం ఆవరించివుంది. అయినా 40 శాతం తెలంగాణ ప్రజలకు సెంటు భూమికూడా లేదు. జనాభాలో 40.69 శాతం తెలంగాణ ప్రజలే, కాని స్థానికులు నేటికీ ఉద్యోగాలకు అనర్హులుగానే మిగిలిపోయారు. ఈ రాష్ట్ర ఖజానాకు 50 శాతం నిధులు తెలంగాణ ప్రాంతం నుండే సమకూరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదికి ఉన్న పరీవాహక ప్రాంతంలో 68.5 శాతం, గోదావరికి వున్న పరీవాహక ప్రాంతంలో 79 శాతం తెలంగాణకనే ఉంది. వాస్తవ వినియోగానికి వచ్చేసరికి అతికొద్ది శాతం నీరు మాత్రమే తెలంగాణకు లభ్యమవుతున్నది. ఈ ప్రాంతం రైతులు చెరువులు, కుంటలు, బోరుబావులపైనా ఆధారపడవలసి వచ్చింది. రాష్ట్ర భూ విస్తీర్ణం లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో 1150 టిఎంసిల నీళ్లు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణం జరగవలసి ఉంది. కాని నేటికి తెలంగాణ ప్రాంతం 380.84 టిఎంసిల నీటికే పరిమితమైంది. సాగునీటికోసం పాలకులు తెలంగాణ ప్రాంతానికి 44.28 శాతం నిధులు ఖర్చు చేయవలసి ఉంటే కేవలం 15.46 శాతంతోనే సరిపుచ్చుతున్నారు. దీనివల్ల తెలంగాణ 52 శాతం బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 13 లక్షల ఉద్యోగాల్లో 5 లక్షల 30 వేల ఉద్యోగాలు తెలంగాణ ప్రాంత వాసులకు దక్కవలసి ఉంది. కాని అవి 2.5 లక్షలకు మించినవేనన్నది కఠోరసత్యం.

ఇకతెలంగాణ పరిశ్రమలకు పుట్టినిల్లు, ఈ ప్రాంతం భౌగోళిక పరిస్థితి పరిశ్రమల నిర్మాణానికి, అభివృద్ధికి అనువుగా ఉన్నాయి. ఈకారణాలలోనే నిజాం కాలంలోనే పలు పరిశ్రమలు స్థాపించబడ్డాయి, మన వలస పాలకులు వాటిని కూడా మనకు దక్కకుండా చేశారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన అజంజాహి మిల్స్‌, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ, దక్కన్‌ గ్లాసు ఫ్యాక్టరీ, డిబిఆర్‌ మిల్స్‌, అంతర్గాం స్పిన్నింగ్‌ మిల్స్‌, సిర్పూర్‌ సర్‌సిల్క్స్‌లు అమ్మేశారు. ఆల్విన్‌ వాచ్‌ డివిజన్‌, ఎపి స్కూటర్స్‌, ఆర్‌ఎఫ్‌సి లాంటి వాటిని మూసివేశారు. ఇక సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థలు జీవచ్ఛవాలుగా మిగిలి ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర సాధనకు దళితులే కీలకం : 53 సంవత్సరాలుగా విద్రోహం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా తెలంగాణ మేధావులు చేసిన కృషి ఫలితంగా ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం ప్రజలకు స్పష్టంగా తెలిసింది. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలన్నీ (సిపిఎం మినహా) తెలంగాణకు అనుకూలమని ప్రకటించక తప్పలేదు. అయినా తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఎండమావినే తలపిస్తోంది. కారణం సుస్పష్టమే!

రాష్ట్రంలో కేవలం తెలంగాణ కోసమే ఏర్పడ్డ రాజకీయ పార్టీలు, సంఘాలు 368 పైమాటే, వీటి మధ్య సారూప్యత వున్నా, వైరుధ్యం హద్దులు దాటింది. పెద్ద మనసుతో వీటన్నింటికి కలుపుకుని, పాలకులపై ఒత్తిడి పెంచాల్సిన ''తెరాస'' అహంభావంతో పెద్దన్న పాత్రనే పోషిస్తుంది. ఫ్రీ జోన్‌ వ్యతిరేక పోరాటంలోను తెరాస ఈ తరహాలోనే వ్యవహరిస్తుంది. తెరాస అధినేత వ్యవహారశైలితో పొసగని వేలాది కరడుగట్టిన తెలంగాణ వాదులు సైతం ఉద్యమానికి దూరమయ్యారు. గత దశాబ్దకాలంగా తెరాస ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఎన్నికల ప్రక్రియద్వారా తెలంగాణ సాధించలేమని తేలింది. నేడు జరుగుతున్న ఫ్రీ జోన్‌ వ్యతిరేక ఆందోళన ఆ విషయాన్నే మరోసారి బుుజువు చేస్తోంది.

తెలంగాణ ప్రాంతంలో 53 శాతం షెడ్యూల్‌ కులాలు, తెగలవారున్నారు. బిసిలు, మైనారిటీల సంఖ్య తక్కువేమికాదు. వీరిని తెలంగాణ ఉద్యమం ఇంకా ఆకర్షించలేదు. 80 శాతంగా ఉన్న ఈ వర్గాల ప్రజల ప్రత్యేక తెలంగాణ విషయంలో ''ఏ రాయి అయితేనేమి పళ్లూడకొట్టుకోవడానికి'' అనే నిరాసక్తతతో వున్నారు, తెలంగాణ వస్తే ఈ వర్గాల ప్రజలకు మేలు చేసే ఒక విజన్‌ కాని, బ్లూ ప్రింట్‌ కాని తెరాస వద్ద లేదు, ఉన్నట్టు కూడా ఏనాడూ ప్రకటించలేదు. కారా మాష్టారు యజ్ఞం కథలోని వెట్టి ఈనాటికి తెలంగాణ అంతటా వ్యాపించివుంది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ బానిసత్వం, భూసంస్కరణలు, కుల వివక్ష, పౌరహక్కులు, రైతుల, కూలీల సమస్యలు, ఉద్యోగుల కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడిన పాపాన పోలేదు. తెలంగాణ ప్రాంతంలో కీలకమైన ఈ సమస్యలపరిష్కారానికి హామీ ఇవ్వకుండా తెరాస తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాననుకోవడం దుస్సాహసమే. కన్యాశుల్కంలోని టాంగావాలాకు వాళ్ల వూరు పోలీసు కానిస్టేబుల్‌ బదలీ ఎంత ముఖ్యమో, తెలంగాణ ప్రాంతంలోని దళితులకు భూస్వామ్య విధానం రద్దు అంతే ముఖ్యం

Tuesday, December 1, 2009

పొట్టి శ్రీరాములు పేరు జెప్పినరు

పొట్టి శ్రీరాములు పేరు జెప్పినరు

విశాలాంధ్ర నేర్పాటు జేసినరు

ఇత్తుదెచ్చినరు పొత్తు గూడినరు

మిగులు నిధులను మింగివేసినరు

తమ ప్రాంతాలభివృదిజేసినరు

మంత్రి పదవులను కొట్టేసినరు

సచివాలయమును ఆక్రమించినరు

కొత్త, కొత్త చట్టాలు జేసినరు

ఉద్యోగాలను దొబ్బివేసినరు

లంచాలు గొట్టి కూడబెట్టినరు

అగ్గువకూ మన భూములు గొన్నరు

కంపెనీలను కట్టుకున్నరు

వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకున్నరు

తమ పనివాళ్ళను తెచ్చుకున్నరు

తెలంగాణులకు తెడ్డుజూపినరు

జర్రున జారే రోడ్లు వేసినరు

తాగి తూగుటకు సారబోసినరు

తెలంగాణనే తెర్లు జేసినరు

మన ఆచారం మంటగలిపినరు

వాళ్ళవన్ని మనమీద రుద్దినరు

ప్రాజెక్టులను కట్టివేసినరు

పారేనదులను ఆపివేసినరు

సాగునీళ్ళనూ దోచుకున్నరు

మంచినీళ్ళనూ మలుపుకున్నరు

మినరల్‌ వాటర్‌ మనకు అమ్మినరు

విద్యాసంస్థలు పెట్టివేసినరు

కళాశాలలను కట్టేసినరు

విద్యను డబ్బుకు అమ్మివేసినరు

సీట్లనెన్నిటినో కొట్టేసినరు

మనలను బయటికి నెట్టేసినరు

ఆసుపత్రులను కట్టివేసినరు

ఫీజులనన్నీ పెంచివేసినరు

గద్దెనెక్కి అధికార్లు ఐనరు

నోట్లు పంచి మన ఓట్లు గుంజినరు

మన ఆరోగ్యం మంట్ల గలిపినరు

భవంతులెన్నో కట్టుకున్నరు

భాగ్యమంత మరి పోగుజేసినరు

ధన, ధాన్యాలతో తూగుతున్నరు

రాజభోగముల దేలుతున్నరు

హైటెక్‌ రాజ్యంలో

హైటెక్‌ రాజ్యంలో
అన్ని పనులు అల్కగానే జరుగుతాయి
ఇప్పుడు మనుషుల ‘మాయం’ కూడ
హైటెక్‌ మాయనే

పెన్నుతో, పేపర్‌తో డాక్టర్‌తో,
పనిలేకుండానే పనైపోతుంది.
ఎఫ్‌.ఐ.ఆర్‌.లు, ఇన్‌వెస్టిగేషన్లు
పోస్టుమార్టంలు దండగ
మాయం చేసే మర్మం తెలిసినోడికి
వీటితో పనేంటి?

వాడికి కావలిసింది
ఆరడుగుల అనువైన జాగ
దానికి తోడు పలుగు, పార సుత
ఇప్పుడు తెలంగాణ భూమిలో
శవాలు నాటుతున్నారు

మొదటి దానికి మెదక్‌ జిల్లా వేదికయింది.
రేపు రామాయంపేట కావచ్చు
ఎల్లండి ఎనగుర్తి కావచ్చు

ఇక తెలంగాణ భూమిలో
మొక్కలు మొలువై
దుష్టులు నాటిని శవాలు మొలుస్తాయి
ఇవే రేపటి పునర్జీవాలు అవుతాయి.

అవి భూమిని బద్దలు చేసి
బయటపడి ఎదిరించి నిలుస్తాయి

తెలంగాణా ఉద్యమం - ప్రజల గొంతు

కలిసుందామని విన్నపాలు -- కాజేద్దామని మన పాలు

నదీ నాదాల దారులు మనవి -- నదీ జలాల దారలు వాళ్ళవి

తెలంగాణా ప్రాంతపు పల్లెలు --ఆంధ్ర పాలకుల ముల్లెలు

సమైక్య రాష్త్రం తో దగా -- లేకుండా పోయింది జాగా

మాటల్లో మనమంతా అన్నదమ్ములు -- చేతల్లో చూషంగా వున్న దమ్ములు

విశాలాంధ్ర ఏర్పాటు బలవంతం -- విడదీసి చేద్దాం ఫలవంతం

మా భూములు చిన్నబోయాయి తడారి -- చూస్తూనే పోతే త్వరలోనే మరో ఎడారి

అందర్నీ సమానం చేస్తామని ఒట్టు -- ఎక్కించారు ఇంతకాలం మునగచెట్టు

చేయాలన్డుంట ప్రజలుకు సేవ -- ఎవరికీ తెలియదులే అధికార యావ

ఆంధ్రుల ఇంట పన్నీరు -- తెలంగాణా కంట కన్నీరు

రామేశ్వరం పోయిన శనేశ్వరం పోలేదన్నట్లు -- గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చిండు

ప్రభుత్వ కళాశాలలు మనవితే -- విద్యార్ధులు వారు

విశ్వ విద్యాలయాలు మనవితే -- వైస్ చాన్సులర్లు వారు

ప్రభుత్వ ఆస్పత్రులు మనవైతే -- డాక్టర్లు వాళ్ళు

కోర్టులు మనవైతే -- జడ్జీలు వాళ్ళు

నల్గొండ లో కట కట త్రాగు నీరు -- పాలమూరులో పత్తా లేదు సాగు నీరు

ప్రైవేటు కళాశాలు వాల్లవైతే -- విద్యార్ధులు మనం

ప్రైవేటు ఆస్పత్ర్హులు వాల్లవైతే-- రోగులు మనం

పరిశ్రమలు వాల్లవైతే -- కాలుష్యం మనకి

కాన్త్రంక్టర్లు వాళ్ళైతే -- కూలీలు మనం

ఎత్తుక పోవడాలు వారివైతే -- ఎత్తిపోతలు మనకు

ఉద్యోగులు వారైతే -- నిరుద్యోగులు మనం

భవనాలు వారివైతే -- పూరి గుడిసెలు మనవి

గుర్రం పరుగు మనకైతే -- జాక్పాట్ వారికి

భాష ఒక్కటే కానీ -- యాస వేరు

జాతి ఒక్కటే కానీ -- నీతి వేరు

ప్రజలోక్కటే కానీ -- పాలకులు వేరు

చాడువులోక్కటే కానీ -- కొలువులు వేరు

భూములోక్కట్ e కానీ -- ధరలు వేరు

నడులోక్కటే కానీ -- పారేతీరు వేరు

రాష్త్రం ఒక్కటే కానీ -- కస్తాలు వేరు

ఆంధ్రులకు నిర్ణయాధికారం -- తెలంగాణకు బానిసత్వం

కలిసుండాలని రెండు ప్రాంతాల పొత్తులు -- పాలకులంతా ఒకే ప్రాంతానికి తొత్తులు

నా(టి) తెలంగాణ కోటి రత్నాల వీణ -- నేటి తెలంగాణ కన్నీటి తంత్రుల వీణ... ఏ తంత్రిని మీటినా కన్నీటి దారలే